తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున సురభి వాణీదేవి పోటీ చేయనున్నారు. సురభి వాణీదేవి పేరును ఖరారు చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం నాడు అధికారికంగా ప్రకటించారు.
సురభి వాణీదేవి దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె. ఆమె సోమవారం నాడు హైదరాబాద్ లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ