భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 12 నుంచి మార్చి 20 వ తేదీ వరకు 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఇంగ్లాండ్ తో తలపడే 19 మంది ఆటగాళ్లతో కూడిన భారత్ జట్టును బీసీసీఐ శనివారం నాడు ప్రకటించింది. ఈ జట్టులో టీ20ల్లో విశేషంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ తెవాతియా చోటు దక్కించుకున్నారు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ జట్టులో ఉన్న మనీష్ పాండే, సంజు సామ్సన్, మయాంక్ అగర్వాల్ కు ఈ జాబితాలో చోటుదక్కలేదు. గాయాల నుంచి కోలుకున్న భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి మళ్ళీ జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకి విశ్రాంతి నిచ్చారు. కరోనా నేపథ్యంలో ఐదు టీ20 లను కూడా అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
భారత్ టీ20 జట్టు:
- విరాట్ కోహ్లీ (కెప్టెన్)
- రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్)
- కేఎల్ రాహుల్
- శిఖర్ ధావన్
- శ్రేయస్ అయ్యర్
- సూర్యకుమార్ యాదవ్
- హార్దిక్ పాండ్య
- రిషభ్ పంత్ (వికెట్ కీపర్)
- ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
- యుజువేంద్ర చాహల్
- వరుణ్ చక్రవర్తి
- అక్షర్ పటేల్
- వాషింగ్టన్ సుందర్
- రాహుల్ తెవాతియా
- టి.నటరాజన్
- భువనేశ్వర్ కుమార్
- దీపక్ చాహర్
- నవదీప్ సైని
- శార్దూల్ ఠాకూర్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ