ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగస్టు 2వ తేదీన నల్గొండ జిల్లాలోని హాలియాలో పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివరి ఆయకట్టు భూములు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఫిబ్రవరి నెలలో ప్రారంభించిన పలు లిఫ్టుల నిర్మాణ పనులతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలను అమలును సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి, సమీక్ష నిర్వహించనున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలు, పనులు జరుగుతున్న తీరు, ఇంకా నియోజకవర్గ పరిధిలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కూడా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించే అవకాశముంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ బుధవారం నాడు హాలియాలో సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ