పీవీ శత జయంతి ఉత్సవాలపై ఆగస్టు 28 న సీఎం కేసీఆర్ సమీక్ష

Centenary Celebrations of Former PM PV Narasimha Rao, CM KCR, Ex PM PV Narasimha Rao, Former PM PV Narasimha Rao, PV Narasimha Rao, PV Narasimha Rao birth centenary, PV Narasimha Rao birth centenary celebrations, Telangana CM KCR

బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు ఏడాది పొడవునా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 28, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై ఈ సమీక్షలో చర్చించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =