తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 443 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 4, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,02,822 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 493 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,94,014 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.90 శాతంగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.
తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ లో 247, రంగారెడ్డిలో 34, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 30, సంగారెడ్డిలో 27, ములుగులో 15, ఖమ్మంలో 12, నల్గొండలో 9, నిజామాబాదులో 9, ఆదిలాబాద్ లో 6, కరీంనగర్ లో 6, పెద్దపల్లిలో 6, యాదాద్రి భువనగిరిలో 4, వికారాబాద్ లో 4, సూర్యాపేటలో 4, మెదక్ లో 4, మంచిర్యాలలో 4, మహబూబ్ నగర్ లో 4, కొమురంభీం ఆసిఫాబాద్ లో 4, హనుమకొండలో 2, సిద్దిపేటలో 2, భద్రాద్రి కొత్తగూడెంలో 2, జోగులాంబ గద్వాల్ లో 1, కామారెడ్డిలో 1, మహబూబాబాద్ లో 1, నాగర్ కర్నూల్ లో 1, రాజన్న సిరిసిల్లలో 1, వనపర్తిలో 1, జనగామలో 1, నారాయణ్ పేట్ లో 1 నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 4,697 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY