ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం మంగళవారం నుంచి బడి గంటలు మోగనున్నాయి. సుదీర్ఘ సెలవుల తరువాత పిల్లలు పాఠశాలలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం మొదటి రోజునే విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను అందించనున్నది. ఈ మేరకు విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒకటవ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ కిట్లను అందించనున్నారు. ఈ కిట్లలో మూడు జతల యూనిఫాం, బెల్టు, బూట్లు, సాక్సులు, స్కూల్ బ్యాగ్, టెక్స్ బుక్స్తో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్-తెలుగు డిక్షనరీని అందించనున్నారు. ఈ నేపథ్యంలో.. సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ హైస్కూల్లో ‘జగనన్న విద్యా కానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించనున్నారు.
కాగా ఈ సారి ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో కొత్త విధానాన్ని అమలు చేయనుంది. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూలు, హైస్కూల్ ప్లస్ వంటి ఆరు అంచెల విధానాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా.. పీపీ-1, పీపీ-2లతో కూడిన శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లను కొత్తగా ప్రారంభించనున్నారు. మరోవైపు విలీన ప్రక్రియ అమలు చేస్తోన్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రస్తుత స్కూళ్ళకు సమీపంలోని హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లకు తరలించేందుకు విద్యాశాఖ, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ను కూడా విడుదల చేసింది. దీనిననుసరించి ఏ రోజున ఏయే కార్యక్రమాలు నిర్వహించాలో సమగ్రంగా వివరించింది. ఇక ఈ విద్యా సంవత్సరానికి గాను 220 రోజులను పని దినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ