తెలంగాణ రాష్ట్రంలో మరో 1640 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 24, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 52,466 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 15,445 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 455 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.86 (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1,007 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 40,334 కి చేరింది. దీంతో రికవరీ రేటు 76.8 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం 11,677 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 683, రంగారెడ్డిలో 135, సంగారెడ్డిలో 102, కరీంనగర్ లో 100, పెద్దపల్లిలో 98, కామారెడ్డిలో 56, నాగర్ కర్నూల్ లో 52, మహబూబాబాద్ లో 44, నల్గొండలో 42, వరంగల్ అర్బన్ లో 36, మేడ్చల్ లో 30, జయశంకర్ భూపాలపల్లిలో 24, వరంగల్ రూరల్ లో 22, మెదక్ లో 22, రాజన్న సిరిసిల్లలో 20, నిజామాబాద్ లో 18, వనపర్తిలో 18, జగిత్యాలలో 17, ములుగులో 14, ఖమ్మంలో 13, భద్రాద్రి కొత్తగూడెంలో 11, మహబూబ్ నగర్ లో 11, యాదాద్రిలో 11, సూర్యాపేటలో 11, జనగామలో 10 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu