తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజే కొత్తగా 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 352 కేసులతో కలిపి జూన్ 18, గురువారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6027 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా వలన ముగ్గురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 195 కి పెరిగినట్టు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా జీహెచ్ఎంసీ ఏరియాలో 302 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ లో 10, మంచిర్యాలలో 4, జనగామ, వరంగల్ అర్బన్ 3 కేసుల చొప్పున, భూపాలపల్లి, మహబూబ్ నగర్, మెదక్, నిజమాబాద్, సంగారెడ్డి జిల్లాలలో 2 కేసుల చొప్పున, ఖమ్మం, నల్గొండ, వరంగల్ రూరల్ జిల్లాలలో ఒక్కోకేసు చొప్పున మొత్తం 352 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 230 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3301 కి చేరింది. ప్రస్తుతం 2,531 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu