దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5 వేలు (5,488) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది. బుధవారం ఉదయానికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4868 ఉండగా, ఒక్కరోజు వ్యవధిలోనే కొత్తగా 620 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 5,488కు చేరింది. దేశంలో ఇప్పటికి 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవగా, అత్యధికంగా మహారాష్ట్రలో 1,367, రాజస్థాన్ లో 792, ఢిల్లీలో 549 నమోదయ్యాయి. కాగా మొత్తం 5488 బాధితుల్లో ఇప్పటికే 2,162 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.
దేశంలో ఒమిక్రాన్ కేసుల వివరాలు (5488):
- మహారాష్ట్ర – 1,367
- రాజస్థాన్ – 792
- ఢిల్లీ – 549
- కేరళ – 486
- కర్ణాటక – 479
- వెస్ట్ బెంగాల్ – 294
- ఉత్తర్ ప్రదేశ్ – 275
- తెలంగాణ – 260
- గుజరాత్ – 236
- తమిళనాడు – 185
- ఒడిశా – 169
- హర్యానా – 162
- ఆంధ్రప్రదేశ్ – 61
- మేఘాలయ – 31
- బీహార్ – 27
- పంజాబ్ – 27
- జమ్మూ కాశ్మీర్ – 23
- గోవా – 21
- మధ్యప్రదేశ్ – 10
- అస్సాం – 9
- ఉత్తరాఖండ్ – 8
- ఛత్తీస్ గడ్ – 5
- అండమాన్ అండ్ నికోబార్ – 3
- చండీఘర్ – 3
- లద్దాఖ్ – 2
- పుదుచ్చేరి – 2
- హిమాచల్ ప్రదేశ్ – 1
- మణిపూర్ – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ