రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూణే మరియు పింప్రి, చిన్చ్వాడ్ ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జూలై 13 నుంచి పది రోజుల పాటు జూలై 23 వరకు లాక్డౌన్ విధించనున్నారు. అవసరమైన సేవలకు సంబంధించిన దుకాణాలు, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ మాత్రమే తెరిచి ఉంటాయని ప్రకటించారు. పూణే నగరంతో పాటుగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఇరవై రెండు గ్రామాల్లో కూడా లాక్డౌన్ అమలు చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు పూణే లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33394 కి చేరుకుంది. వీరిలో 15179 మంది కరోనా నుంచి కోలుకోగా, 989 మంది మరణించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu