తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2092 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 5, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 73,050 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 21,346 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 13 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 589 కి పెరిగింది. ఇప్పటివరకు 52,103 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 20,358 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 71.3 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.80 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2092):
- జీహెచ్ఎంసీ – 535
- రంగారెడ్డి – 169
- వరంగల్ అర్బన్ – 128
- మేడ్చల్ – 126
- కరీంనగర్ – 123
- సంగారెడ్డి – 101
- నిజామాబాద్ – 91
- రాజన్న సిరిసిల్ల – 83
- జోగులాంబ గద్వాల్ – 72
- ఖమ్మం – 64
- పెద్దపల్లి – 54
- నల్గొండ – 52
- మహబూబ్ నగర్ – 48
- మంచిర్యాల – 43
- భద్రాద్రి కొత్తగూడెం – 36
- సూర్యాపేట – 34
- వనపర్తి – 34
- జగిత్యాల – 28
- కామారెడ్డి – 28
- ములుగు – 27
- జనగామ – 26
- నిర్మల్ – 25
- వరంగల్ రూరల్ – 24
- నాగర్ కర్నూల్ – 22
- జయశంకర్ భూపాలపల్లి – 21
- సిద్దిపేట – 20
- మెదక్ – 18
- ఆదిలాబాద్ – 17
- మహబూబాబాద్ – 16
- యాదాద్రి భువనగిరి – 12
- వికారాబాద్ – 9
- నారాయణ్ పేట్ – 6
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu