తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం ప్రగతి భవన్ నుంచి వరంగల్కు రోడ్డుమార్గంలో చేరనున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా పెంబర్తిలో ఆగనున్న సీఎం కేసీఆర్ అక్కడి ప్రసిద్ధ హస్త కళాఖండాలను పరిశీలించనున్నారు. అనంతరం నేటి రాత్రికి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా నేతలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీలోని పలు కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు. ఇక ఆదివారం ఉదయం వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితిపై ఏరియల్ సర్వే చేయనున్నారు. కడెం నుంచి భధ్రాచలం వరకు చేపట్టనున్న ఈ సర్వేలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ