మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 13180 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకిందని ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఇందులో 10655 మంది పూర్తిగా కోలుకున్నారని, 136 మంది పోలీసులు మరణించారని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో 1060 మంది అధికారులు, 9595 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే ఈ వైరస్ వలన మరణించిన వారిలో 14 మంది అధికారులు, 122 మంది సిబ్బంది ఉన్నారు. 313 మంది అధికారులు, 2076 మంది సిబ్బందితో కలిపి మొత్తం 2389 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు పోలీస్ శాఖ వెల్లడించింది. ఇక మహారాష్ట్ర రాష్ట్రంలో ఆగస్టు 20, గురువారం నాటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,43,289 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 21,359 కి పెరిగింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu