భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 29 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 68,898 కేసులు, 983 మరణాలు నమోదయ్యాయి. ఆగస్టు 21, శుక్రవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 29,05,823 కు, మరణాల సంఖ్య 54849 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 21 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో 62,282 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 21,58,946 కు చేరుకుంది. దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నపటికి, కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 74.3 శాతం, మరణాల రేటు 1.89 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 6,92,028 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu