తెలంగాణ రాష్ట్రంలో మరో 551 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 17, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,80,195 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1506 కి పెరిగినట్టు తెలిపారు. కాగా మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.
కరోనా నుంచి కొత్తగా 682 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,71,649 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 96.94 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం 7,040 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 111, రంగారెడ్డిలో 48, మేడ్చల్ లో 42, వరంగల్ అర్బన్ లో 31, కరీంనగర్ లో 24, సంగారెడ్డిలో 23, భద్రాద్రి కొత్తగూడెంలో 21 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ