ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 18, శుక్రవారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా జగనన్న అమ్మ ఒడి రెండో విడత, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు, తిరుపతిలో భూమి సర్వే అకాడమీ ఏర్పాటు, వైఎస్ఆర్ రైతు భరోసా మరో విడత చెల్లింపులు, ఏపీ టూరిజం పాలసీ, నివర్ తుపాను వలన నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల, ఈ నెల 25 న జరగనున్న ఇళ్ల పట్టాల పంపిణీ పథకం, గన్నవరం విమానాశ్రయం విస్తరణ సహా మొత్తం 40 అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ