తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేంద్ర రెడ్డి 15 రోజుల పాటుగా సెలవుల్లో ఉండనున్నారు. మెడికల్ లీవ్ లో భాగంగా ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు సెలవులో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ఈ 15 రోజుల పాటుగా తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న అంజనీ కుమార్ కు రాష్ట్ర డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సెలవుల నుంచి వచ్చిన అనంతరం ఎం.మహేంద్ర రెడ్డి తిరిగి రాష్ట్ర డీజీపీగా కొనసాగనున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ