మాజీ మంత్రి ఈటల రాజేందర్ శనివారం నాడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముందుగా తన ఇంటివద్ద నుంచి అనుచరులతో కలసి గన్పార్కు వద్దకు చేరుకొని అమరవీరుల స్థూపం వద్ద అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్ కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఈ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, టీఆర్ఎస్ పార్టీ బీ-ఫారం ఇచ్చి ఉండొచ్చు కానీ గెలిపించింది ప్రజలు అని అన్నారు. 14 ఏళ్లుగా ఎమ్మెల్యే గా ఓటమి లేకుండా ప్రజల్లో ఉన్నాను. తెలంగాణ కోసం అసెంబ్లీ వేదికగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రశ్నించాను. ఇతర పార్టీలలో గెలిచి టీఆర్ఎస్ లో చేరి మంత్రులుగా కొనసాగుతున్నారు. చట్టాన్ని అతిక్రమించి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారని ఈటల అన్నారు.
హుజురాబాద్ లో జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామమేనని, అందులో అంతిమంగా తెలంగాణ ప్రజలు మాత్రమే విజయం సాధిస్తారని చెప్పారు. హుజురాబాద్ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే తాను రాజీనామా చేస్తున్నానని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో తప్పకుండా తనవంతు ప్రయత్నం చేస్తానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మరోవైపు జూన్ 14, సోమవారం నాడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరి, కాషాయ కండువా కప్పుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ