మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 12, శనివారం నాడు 10697 కరోనా కేసులు, 360 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,98,550 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,01,833 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 14,910 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 56,31,767 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.48 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.84 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,55,474 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు అత్యధికంగా పుణేలో 10,34,502, ముంబయిలో 7,14,965, థానేలో 5,69,791, నాగ్పూర్లో 4,92,125, నాశిక్ లో 3,93,352 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు శనివారం నాటికి మహారాష్ట్రలో 3,78,34,054 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ