తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వరుసగా రెండు రోజులనుంచి కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేశాయి. భారీ వర్షాల వలన నగరంలో పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో తీవ్ర వరదనీటి ఉధృతికి ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రయాణికులు, వాహనదారులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. రెండు రోజులుగా ఆగకుండా వర్షాలు కురుస్తుండడంతో హైదరాబాద్ కూ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. మరో మూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో అత్యవసర పరిసితుల్లో తప్ప ఈ మూడు రోజులు పాటుగా నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలు అన్ని వర్షం దాటికి అస్తవ్యస్తం అవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో అనేక కాలనీలు జల దిగ్బంధం అయ్యాయి. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నగరంలో పలు చోట్ల రోడ్లు నీటితో నిండిపోయి చెరువులను తలపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలగా ఏర్పడి విధులు నిర్వహిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ రెస్కూబృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. నగరంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు భారీ వర్షాలకు హిమాయత్సాగర్లోకి భారీగా వరద నీరు చేరడంతో, రెండు అడుగుల మేరకు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే అతి భారీ వర్షాల వలన తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ను అధికారులు జారీ చేశారు.
జీహెఛ్ఎంసీ పరిధిలో సంప్రదించాల్సిన నెంబర్లు:
- అత్యవసర సేవల కోసం 040-211111111
- విపత్తు నిర్వహణ శాఖ – 9000113667, 9704601866
- చెట్లు తొలగించే సిబ్బంది కోసం 6309062583
- విద్యుత్ శాఖ – 9440813750
- ఎన్డీఆర్ఎఫ్ సేవలు – 8333068536, 040-2955 5500
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu