బోధన్ సంఘటనపై డీజీపీ, కమీషనర్ లతో మాట్లాడిన హోంమంత్రి మహమూద్ అలీ

Home Minister Mahmood Ali Enquires about Bodhan Incident with DGP Mahender Reddy, Mahmood Ali Enquires about Bodhan Incident with DGP Mahender Reddy, Bodhan Incident with DGP Mahender Reddy, DGP Mahender Reddy, Mahender Reddy, DGP, Home Minister Mahmood Ali, Home Minister, Mahmood Ali, Bodhan Incident, Bodhan Incident Latest News, Bodhan Incident Latest Updates, Mango News, Mango News Telugu,

బోధన్ సంఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, నిజామాబాద్ కమీషనర్ కే.ఆర్ నాగరాజులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, కమిషనర్ ఇతర పోలీసు అధికారులు బోధన్ లోనే ఉండి పరిస్థితులు సమీక్షిస్తున్నారు అని డీజీపీ హోంమంత్రికి వివరించారు. ఉద్రిక్తతలకు దారి తీసిన పరిస్థితులపై హోం మంత్రి ఆరాతీశారు. ఘర్షణ వాతావరణాన్ని అదుపు చేశామని అని డీజీపీ హోం మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానమైన ప్రాధాన్యత కల్పిస్తూ సెక్యులర్ నాయకుడుగా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానమైన గౌరవం ఉందని పేర్కోన్నారు. పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తతో ఉన్నారని, ప్రజలు పోలీసులకు సహకరించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =