హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మరోసారి స్వల్ప మార్పులు చేయబడ్డాయి. ప్రయాణ సమయాలను రీషెడ్యూల్ చేస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి (సెప్టెంబర్ 6, సోమవారం) నుంచి మొదటి రైలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక చివరి మెట్రో రైలు రాత్రి 10.15 గంటలకు ప్రారంభమవుతుందని, ఆ మెట్రో రైళ్లు రాత్రి 11:15 గంటలకు డెస్టినేషన్ కు చేరుకుంటాయని తెలిపారు. ఇప్పటివరకు టెర్మినల్ మెట్రో స్టేషన్స్ లో చివరి మెట్రో రైలు రాత్రి 9.45 కు ప్రారంభమవుతుండగా, తాజాగా ఆ సమయాన్ని మరో అరగంట పొడిగిస్తూ రాత్రి 10:15 గంటల నుంచి ప్రారంరంభమయ్యేలా మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మెట్రో ప్రయాణం సందర్భంగా అన్ని కోవిడ్ నిబంధనలు అమల్లో ఉంటాయని, ప్రయాణికులంతా నిబంధనలు పాటిస్తూ సహకరించాలని మెట్రో అధికారులు కోరారు.
Passengers are requested to follow the COVID-19 Safety guidelines strictly for keeping the metro journey safe for everyone. Let us all be #ResponsibleCitizens.#HyderabadMetro #ManaMetro #MyMetroMyPride pic.twitter.com/qnahQtJJId
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 5, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ