తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి 1,10,248 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. జనవరి 22, శుక్రవారం నాడు మొత్తం 33 జిల్లాల్లో 489 కేంద్రాల్లో 12,944 మందికి వ్యాక్సిన్ వేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం నాడు రాష్ట్రంలోని 28,433 హెల్త్కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేసేలా లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 45.5 శాతం (12,944) మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తీవ్ర అస్వస్థతకు ఎవరూ గురికాలేదని చెప్పారు. కాగా ఐదుగురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, వారు ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ కు జనవరి 25, సోమవారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ