ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట, పువ్వాడ ఫౌండేషన్-ఖమ్మం సంయుక్తంగా అందిస్తున్న రెండున్నర కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆదివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించారు. వాటిని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ మంత్రిని అభినందించారు. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల కోసం వినియోగించనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. అమెరికా నుండి ఈ కొత్త కాన్సన్ట్రేటర్లను దిగుమతి చేసే విషయంలో సునీల్ చావలి సహకరించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ