కోవిడ్-19 వ్యాధికి గురై కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి పిలుపు నిచ్చారు. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న వారికీ ప్లాస్మా దానం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి సంక్షోభంతో ప్రతికూల పరిస్థితులు నెలకున్న ఈ సమయంలో ప్లాస్మా దానం చేయడంకంటే గొప్ప మానవత్వం ఉండదని పేర్కొన్నారు. కరోనా వారియర్లు ప్రాణ రక్షకులుగా మారాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విడుదల చేసిన వీడియోను, ప్లాస్మా దానానికి సంబంధించిన వెబ్ సైట్ https://donateplasma.scsc.in ను కూడా ట్వీట్ లో ట్యాగ్ చేశారు.
Humbly appeal to all RECOVERED Covid-19 patients to come forward & DONATE PLASMA to SAVE LIVES. There can be no greater humanitarian gesture in these times of unprecedented crisis. Covid-19 Warriors, Be Saviors Now! https://t.co/InPwNsoZ3q@TelanganaDGP @TelanganaCOPs https://t.co/090pxOvVcw
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu