మెగాస్టార్ చిరంజీవికి ‘ఇండియన్‌ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ పురస్కారం

Megastar Chiranjeevi Honoured with IFFI Indian Film Personality of the Year-2022 Award,Megastar Chiranjeevi,Indian Film Personality of the Year-2022,IFFI Award 2022,Indian Film Personality Award, Mango News,Mango News Telugu,Chiranjeevi IFFI Award 2022,Chiranjeevi IFFI Award,Chiranjeevi Latest News And Updates,Megastar Chiranjeevi News And Updates,Megastar Of Tollywood, Tollywood Latest News,Latest Tollywood Releases,Telugu Movies, Telugu Movies News,

ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్​ చిరంజీవికి మరో అరుదైన పురస్కారం లభించింది. ఐఎఫ్ఎఫ్ఐ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డ్ మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. గోవాలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 53వ ఎడిషన్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. నాలుగు దశాబ్దాలకుపైగా విశిష్టమైన చలనచిత్ర కెరీర్ లో మెగాస్టార్ చిరంజీవి 150కి పైగా చిత్రాలలో, అలాగే హిందీ, తమిళం మరియు కన్నడ భాషలలో కొన్ని చిత్రాలలో నటించారని, అతను తెలుగు సినిమా యొక్క అత్యంత విజయవంతమైన మరియు ప్రభావవంతమైన నటులలో ఒకరిగా పరిగణించబడ్డాడని పేర్కొన్నారు.

“1982లో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో తన నటనతో జనాల ప్రేమ, అభిమానాలు కైవసం చేసుకున్నాడు. శక్తితో నిండిన తన ఉత్సాహభరితమైన డాన్స్ మరియు పోరాట సన్నివేశాలకు ప్రేక్షకులు చిరంజీవికి వీరాభిమానులు అయ్యారు. అతని అభిమానులపై అతని ప్రభావం మెగాస్టార్ అనే బిరుదును పొందేలా చేసింది. 2006లో భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారతదేశం యొక్క మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో చిరంజీవిని సత్కరించారు” అని అవార్డు ప్రకటన సందర్భంగా ఘనంగా ప్రకటిస్తూ, చిరంజీవి చిత్రాల విజువల్స్ తో కూడిన పవర్ ఫుల్ వీడియోను ప్రదర్శించారు.

గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా వేదికపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్‌తో కలిసి కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ అవార్డును ప్రకటించారు. సినిమా, జనాదరణ పొందిన సంస్కృతి మరియు సామాజికంగా ముఖ్యమైన కళాత్మక పనికి చేసిన కృషికి గానూ మెగాస్టార్‌ చిరంజీవికి ఈ అవార్డు దేశం ఇచ్చే గుర్తింపు అని పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తూ, కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నటుడిగా 150కి పైగా చిత్రాలతో అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉన్నారని అన్నారు. ఆయన తెలుగు సినిమాల్లో అపారమైన ప్రజాదరణ పొందారు, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు” అని చెప్పారు. గతంలో వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీం ఖాన్, బిస్వజిత్ ఛటర్జీ, హేమా మాలిని, ప్రసూన్ జోషి వంటి సినీ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు.

ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, “ఈ సన్మానం/గౌరవం దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి, నాపై ప్రేమ చూపించే అభిమానులందరికి నా ధన్యవాదాలు. నా అభిమానుల వలనే ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + twelve =