తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వస్తుండగా కొండపాక మండలం బండారం దర్గా కమాన్ సమీపంలో మంత్రి హరీశ్రావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హరీశ్రావు కాన్వాయ్ లో ముందు వెళ్తున్న కారుకు ఒక్కసారిగా అడవి పందులు అడ్డువచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనకాలే వచ్చే పైలట్ కారు, ఆ తర్వాత ఉన్న హరీశ్ రావు కారు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ముందు కారులోని వ్యక్తికి స్వల్పగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. హరీశ్రావు ప్రయాణిస్తున్న కారు ముందు భాగం కొంతమేర ధ్వంసమైంది. అనంతరం మరో కారులో మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ కు బయల్దేరివెళ్లారు.
ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. “సిద్ధిపేట నుండి హైదరాబాద్ కు తిరుగుప్రయాణంలో కొండపాక వద్ద నా కారుకు ప్రమాధం జరిగింది. నేను క్షేమంగానే ఉన్నా. నా డ్రైవర్, గన్ మెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి శ్రేయేభిలాషులు, మిత్రులు ఆంధోళన చెందవద్దని కోరుతున్నా” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ