జమ్ముకశ్మీర్ కిస్త్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో ముగ్గురు జవాన్లతో ప్రయాణిస్తున్న తేలికపాటి హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. కాగా మృతి చెందిన జవాన్ ను తెలంగాణకు చెందిన పబ్బాల అనిల్ (39)గా గుర్తించారు. దీంతో ఆయన స్వగ్రామంలో విషాదం అలుముకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి, మల్లయ్య దంపతుల చిన్న కుమారుడు అనిల్ (27) 2011లో ఆర్మీలో చేరాడు. ఆయన సైన్యంలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో విధుల నిర్వహణలో భాగంగా నిన్న హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు లోయలో కుప్పకూలిన ఘటనలో అసువులు బాసాడు.
ఈ నేపథ్యంలో.. అనిల్ మృతి పట్ల రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. ఘటన దురదృష్టకరమని, ప్రమాదంలో యువ జవాన్ని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మంత్రి కేటీఆర్.. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా అనిల్కు మండలంలోని కోరెం గ్రామానికి చెందిన సౌజన్యతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి అయాన్, ఆరవ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గత నెలలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరైన అనిల్ 20 రోజుల క్రితం తిరిగి వెళ్ళాడు. ఇక అనిల్ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE