నగరంలోని ఉప్పల్ భగయత్ పరిధిలో రెండు ఎకరాల స్థలంలో అన్ని హంగులతో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి సోమవారం ఉదయం రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.70 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిని క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అలాగే రూ.10 కోట్ల వ్యయంతో క్రిస్టియన్ భవన్ ను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు, స్టీఫెన్ సన్, కార్పొరేటర్లు, పలువురు క్రైస్తవ మత పెద్దలు, బిషప్ లు, పాస్టర్లు, స్థానిక నేతలు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE