భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ – పూర్వపు టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పార్టీలోని ముఖ్య నాయకులకు మరియు కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్.. నేడు భరతమాత బంగారు భవిత కోసం పోరాడుతున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె తన ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పార్టీని స్థాపించిన నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిందని, రాష్ట్ర సాధన అనంతరం తొమ్మిదేళ్ల స్వపరిపాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలింపిందని.. ఈ క్రమంలో నేడు దేశ ప్రగతి కోసం, రైతు రాజ్యం కోసం వడివడిగా అడుగులు వేస్తోన్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు.
కేసీఆర్ గారి నాయకత్వంలో పిడికెడు మందితో ప్రారంభమై, ప్రత్యేక రాష్ట్రం సాధించి, తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపి..
నేడు దేశ ప్రగతి కోసం, రైతు రాజ్యం కోసం వడివడిగా అడుగులు వేస్తున్న @BRSparty కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ… pic.twitter.com/W2kEZ4L9QO
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 27, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ