తెలంగాణలోని మునుగోడులో ఉప ఎన్నికలకు ముందు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షాక్ ఇచ్చింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆయన భారీగా నగదు లావాదేవీలు నిర్వహించారనే ఆరోపణలపై నోటీసులు ఇచ్చింది. రాజగోపాల్రెడ్డి కుటుంబానికి చెందిన మైనింగ్ సంస్థ సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ నుంచి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని పలువురి బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయని అధికార టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీచేసింది.
ఈనెల 14,18,29 తేదీల్లో మునుగోడు నియోజకవర్గ పరిధిలోని 23 మంది వేర్వేరు వ్యక్తులు మరియు వివిధ సంస్థలకు కంపెనీకి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా ద్వారా మొత్తం రూ.5.24 కోట్ల నగదు ట్రాన్స్ ఫర్ చేశారని భరత్ కుమార్ శనివారం ఆధారాలను సమర్పించారు. ఆ మొత్తాన్ని క్యాష్ రూపంలో విత్ డ్రా చేయించి ఓటర్లకు పంచిపెట్టేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సోమవారం సాయంత్రం 4 గంటల లోపు వివరం ఇవ్వాలని నోటీసుల్లో ఈసీ స్పష్టం చేసింది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి తగిన సమాధానం ఇవ్వకుంటే ఆయనపై ఎన్నికల నియమావళిని అనుసరించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక నిన్న చండూరులో జరిగిన బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE