బీజేపీలో చేరిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి

Marri Shashidhar Reddy Joins BJP in the Presence of Union Ministers Kishan Reddy Sarbananda Sonowal in New Delhi,Telangana Senior Congress Leader,Marri Shasidhar Reddy Joined Bjp,Marri Shasidhar Reddy to join BJP, Marri Shasidhar Reddy in Delhi on Nov 25,T-Congress Leader Marri Shashidhar Reddy,Marri Shashidhar Reddy Resigned,Shashidhar Reddy Resigned For T-Congress,Mango News,Mango News Telugu,Marri Shashidhar Reddy Latest News and Updates,Telangana Congress,Telangana Latest News And Updates,Telangana Congress Party,Telangana Congress Party News And Live Updates,Marri Shashidhar Reddy Join BJP?,Shashidhar Reddy Meet Modi,Shashidhar Reddy News And Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీనియర్ నేత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఎ) మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, సర్బానంద సోనోవాల్‌ సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరి, కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డికి వారు పార్టీ ప్రాథమిక సభ్యతాన్ని అందించి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు.

ముందుగా మర్రి శశిధర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మర్రి శశిధర్ రెడ్డి 1992, 1994, 2004, 2009లలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో నక్సల్స్ హింసాకాండపై ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు కన్వీనర్‌గా, 2005లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలో వైస్ చైర్మన్ కూడా సేవలు అందించారు. ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి పార్టీ పనితీరుపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నానని, తన రాజీనామా లేఖను పార్టీ అగ్రనేత సోనియాగాంధీ మరియు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్లు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోందని, అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని శశిధర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోయిందని, శ్రేణులను సరైన దిశలో నడిపించే నాయకత్వం లేదని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్ఫష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =