మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించనుంది – తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Munugode By-Poll This Election Verdict will Determine the Future of Telangana Says Bandi Sanjay, Munugode By-Poll Election Verdict, Bandi Sanjay Says Munugode will Determine Future of Telangana, Mango News, Mango News Telugu, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన బీజేపీ అభ్యర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ముందుగా బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల తీర్పు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించనుంది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఇప్పుడే కాదని తొలినుంచీ కాంట్రాక్టరేనని, ఆయన ఎంతోమందికి ఆర్ధికంగా సహాయం చేశారని సంజయ్ అన్నారు. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేశాకే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారని చెప్పారు. భారీగా నగదు పంచడానికి టీఆర్ఎస్ సిద్ధమైందని, అయినా ప్రజలు పెద్దఎత్తున బీజేపీకి ఓట్లు వేసి కేసీఆర్‌కు మైండ్ బ్లాంక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రచారం కోసం సీఎం కేసీఆర్ తన మంత్రులను, ఎమ్మెల్యేలను ఇక్కడికి పంపారని, కానీ ఆ పార్టీ నాయకులందరూ ఇక్కడ ఫుల్లుగా మద్యం సేవించి గలాటా చేసుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 1 =