బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు జైలు శిక్ష పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఐదు సంవత్సరాల క్రితం బీఫ్ ఫెస్టివల్ వివాదంలో నమోదైన కేసులో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. బీఫ్ ఫెస్టివల్ను అడ్డుకునే క్రమంలో పోలీసులపై దురుసుగా వ్యవహరిస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే అభియోగంతో బొల్లారం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం నాడు ఆయనకు జైలు శిక్ష విధించింది. కాగా తీర్పు అనంతరం రాజా సింగ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది. అయితే ఈ కేసుపై ఎమ్మెల్యే రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ