మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. లారీ అతివేగంతో వచ్చి అదుపుతప్పి ఆటోను ఢీకొట్టినట్టు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భాంతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు తక్షణమే అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ