తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పక్రియ మొదలైంది. ఈ స్థానాలకు మార్చి 31, 2021 తో పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ రెండు స్థానాలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఈ రోజు (ఫిబ్రవరి 16, మంగళవారం) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో మంగళవారం నుంచే నామినేషన్లను స్వీకరణ ప్రారంభమైంది. నామినేషన్లను ఫిబ్రవరి 23 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య స్వీకరించనున్నారు. అలాగే మార్చి 14 వ తేదీన పోలింగ్ నిర్వహించి, మార్చి 17న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ – ఫిబ్రవరి 16
- నామినేషన్ల స్వీకరణ ప్రారంభం – ఫిబ్రవరి 16
- నామినేషన్లకు ఆఖరితేదీ – ఫిబ్రవరి 23
- నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 24
- ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఫిబ్రవరి 26
- ఎన్నిక జరిగే తేదీ – మార్చ్ 14
- పోలింగ్ సమయం – ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
- ఓట్ల లెక్కింపు – మార్చ్ 14
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ