తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా “కోటి వృక్షార్చన” పేరుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న “కోటి వృక్షార్చన” ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు, ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటుదాం, సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు కానుకగా ఇద్దాం అని ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
“తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళ కళా అడాలి అని మన సీఎం కేసీఆర్ గారి ఆకాంక్ష, కోరిక. అందుకు గానూ మనమందరం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వామ్యం అయి మొక్కలు నాటుదాం. సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు కానుకగా ఇద్దాం. వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుందాం” అని చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రముఖ నటులు నాగార్జున, మహేష్ బాబు, సంజయ్దత్, అజయ్ దేవగన్, సినీ నటి, ఎమ్మెల్యే రోజా సహా పలువురు ప్రముఖులు కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
పచ్చదనాన్ని ప్రేమించే సీఎం కేసీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.MP సంతోష్ కుమార్ గారు చేపట్టిన #GreenIndiaChallenge కోటి వృక్షార్చన లో భాగస్వాములమయ్యి మొక్కలు నాటటం మనం Shri.KCR గారికి ఇచ్చే కానుక.అందరం మొక్కలు నాటుదాం…
వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుందాం.— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ