దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సిన్ పంపిణి ప్రారంభించిన 31 వ రోజైన ఫిబ్రవరి 15, సోమవారం నాడు మొత్తం 10,574 సెషన్స్ లో 4,35,527 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 2,99,797 లబ్దిదారులకు మొదటి డోస్, 1,35,730 మంది హెల్త్ కేర్ వర్కర్లకు సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపారు.
ఇక ఫిబ్రవరి 16, మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి మొత్తం సంఖ్య 87 లక్షలు (87,20,822) దాటింది. వీరిలో 61,07,120 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 24,53,411 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోస్), 1,60,291 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్) ఉన్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికి దాకా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 9,34,962 , గుజరాత్ లో 6,99,352, రాజస్థాన్ లో 6,27,710 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 3,76,444, తెలంగాణలో 2,93,442 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ