కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కల్లును నిషేధించి గీత కార్మికుల ఉపాధిని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వృత్తిపై నిషేధం విధించడంపై పలు వేదికలపై బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టినందుకు, కర్ణాటక గీత కార్మికుల పక్షాన సానుకూలంగా స్పందించినందుకు కర్ణాటక రాష్ట్రంలో కల్లు నిషేధంపై సుదీర్ఘ కాలం నుండి గీత కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న శ్రీ నారాయణ గురు శక్తిపీఠం పీఠాధిపతులు, ఆర్య, ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు డా.ప్రణవానంద స్వామి మంత్రి కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. హైదరాబాద్లోని మంత్రి కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లను కలిసి తమ సమస్యలపై స్పందించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కర్ణాటక రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డా.ప్రణవానంద స్వామి డిమాండ్ చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ గౌడ కులస్తులకు వర్తింపజేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ సహా పలువురు రాష్ట్ర గౌడ నేతలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY