ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నవంబర్ 11న ఆయన విశాఖపట్టణంలో ఒక్క రోజు పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వీటిలో ప్రధానంగా సుమారు రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కొన్ని ప్రాజెక్టులు సహా ఇప్పటికే పూర్తయిన వాటికి ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో విశాఖపట్నం హెచ్పిసిఎల్ పెట్రోలియం రిఫైనరీ విస్తరణ మరియు ఆధునికీకరణ ప్రాజెక్ట్, ఐఐఎం యొక్క ఆధునిక ఎకో విధానంలో రూపొందిన కొత్త క్యాంపస్ మరియు విశాఖపట్నంలోని క్రూయిజ్ టెర్మినల్ యొక్క మొదటి దశ పనులు ఉన్నాయి.
అనంతరం విశాఖలోని ఆంధ్రా యూనివనర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు. కాగా ప్రధాని మోదీ పర్యటనకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, ఇతర అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ప్రధాని పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర ఏర్పాట్లపై కీలక సమీక్ష నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY