తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నివారణకు లాక్డౌన్ అమలు చేయడమే కాకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటుంది. అందులో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్న హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఇళ్లలోకి పనిమనుషులకు అనుమతి లేదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాల పరిధిలోని గేటెడ్ కమ్మ్యూనిటీలకు మరియు అన్ని అపార్ట్ మెంట్ లకు ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పారు. ఒకవేళ ఎవరి ఇంటిలోనైనా తప్పనిసరి అయితే ముందుగా సంబంధిత మునిసిపల్ ఆఫీసు నుండి నో ఆబ్జెక్షన్ లెటర్ తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మే 7, గురువారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1122 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 12 కేసులు నమోదవగా, వలస వచ్చిన వారికీ ముగ్గురికి కరోనా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది మృతి చెందగా, 693 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 400 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu