తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జూన్ 15 నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు. ఇప్పటికి 60.75 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7298.83 కోట్ల రైతుబంధు నిధులను జమచేసినట్టు తెలిపారు. ఇక జూన్ 24, గురువారం నాడు మరో 18 వేల మంది రైతుల ఖాతాలలో 2.40 లక్షల ఎకరాలకు గానూ రూ.120.16 కోట్లు జమ చేయడం జరుగుతుందన్నారు.
ఈ విడతలో రైతుబంధు పంపిణీలో భాగంగా 63,25,695 మంది రైతులకు రూ.7508.78 పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటికి 60.75 లక్షల మంది రైతులకు రూ.7298.83 కోట్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 145.98 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ