తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. మొయినాబాద్ ఫామ్హౌస్లో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన కేసులో నిందితులతో సంబంధాలున్నట్లుగా భావించబడుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు విచారణకు హాజరు కాకపోవడంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిట్ తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. ఈ కేసుకి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా బీఎల్ సంతోష్కు ఇప్పటికే సమన్లు పంపామని, 20వ తేదీనే ఆయనకు నోటీసులు అందినప్పటికీ ఆయన సిట్ ముందు గైర్హాజరయ్యారని తెలిపారు. బీఎల్ సంతోష్ను సిట్ ముందు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని, ఈ క్రమంలో ఆయనకు మరోసారి నోటీసులిచ్చేందుకు అనుమతించాలని కోర్టుని కోరారు.
దీనికి సమ్మతించిన న్యాయస్థానం, సంతోష్ విచారణకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత పిటిషనర్పై ఉందని, సంతోష్కు మరోసారి 41సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అయితే ఈసారి ఈ-మెయిల్ ద్వారా నోటీసులివ్వమని సూచించింది. అలాగే విచారణకు ఆయన హాజరుకానందున ఆయనను అరెస్ట్ చేయరాదని హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరారు. అయితే దీనికి మాత్రం కోర్టు నిరాకరించింది. దీనిపై ఈ నెల 29న కౌంటర్ దాఖలు చేయాలని సూచించిన న్యాయస్థానం అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE