తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ పాదయాత్ర తొలిదశలో ఇప్పటివరకు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. పట్టణంలోని స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సారథ్యంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఈ బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాఘెల్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి సీఎం భూపేష్ భాఘెల్ ప్రసంగించనున్నారు. అలాగే మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇంచార్జి జైరాం రమేష్ కూడా కరీంనగర్ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE