నిన్న (గురువారం) తెలంగాణ మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కొట్టిపడేశారు. నిన్న కరీంనగర్ జిల్లాలో పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ.. బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు చేసింది ఏమి లేదని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని చురకలు అంటించారు. అదే సమయంలో, మంత్రి గంగుల కమలాకర్పై పోటీ చేసి గెలవాలని బండి సంజయ్కు సవాల్ విసిరారు.
దీనిపై స్పందించిన సంజయ్, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారని, వాటిని పట్టించుకోబోనని తెలిపారు. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయం అని సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాకు ఉపాధి హామీకి నిధులు తెచ్చింది తానే అని బండి సంజయ్ తెలిపారు. అధికారంలో ఉన్నవారు అహంకారంతో పాలిస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అవినీతి అక్రమాలతో అభివృద్ధి సాధించలేమని పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలను సానుకూలంగా చూడాలని, ప్రజల సమస్యలపైనే ప్రతిపక్షాలు నిరంతరం పోరాటం చేస్తాయని బండి సంజయ్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ