తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయిన విషయం తెలిసిందే. సమావేశాలు ప్రారంభమయ్యాక 2022-23 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్నారని, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావు ను సస్పెండ్ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో శాసనసభ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తునట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ