తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1432 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 14, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,17,670 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 8 గురు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1249 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 1949 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,93,218 కి చేరింది. ప్రస్తుతం 23,203 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 88.76 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 244, మేడ్చల్ లో 115, భద్రాద్రి కొత్తగూడెంలో 99, ఖమ్మంలో 91, రంగారెడ్డిలో 88, నల్గొండలో 74, కరీంనగర్ లో 74, సూర్యాపేటలో 53, వరంగల్ అర్బన్ లో 46, వరంగల్ రూరల్ లో 34, పెద్దపల్లిలో 32, సిద్దిపేటలో 31 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu