తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 22, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,056 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా వలన ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1588 కి పెరిగింది.
ఇక గత 24 గంటల్లో 431 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,87,899 కు చేరుకుంది. ప్రస్తుతం 3,569 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో 76 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం నాడు 30,005 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 76,32,980 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,05,077 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ