తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 495 కేసులు నమోదవడంతో మార్చి 26, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,804 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ఇద్దరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1685 కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో 247 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 2,99,878 కు చేరుకుంది. ప్రస్తుతం 4,241 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాడు 58,029 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 99,61,154 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 2,67,629 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ