ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా(ఎస్ఈసీ) నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు నీలం సాహ్ని పేరును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఏపీ సీఎస్ గా పదవీవిరమణ పొందిన అనంతరం నీలం సాహ్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ఉన్నారు.
ముందుగా ప్రస్తుత ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన ఎస్ఈసీ నియామకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు నిర్వహించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్ ను గవర్నర్ వద్దకు పంపింది. అనంతరం ఆ ముగ్గురిలో నూతన ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ